Site logo

జర్నలిస్ట్ కుటుంబాలకు యుప్ టీవీ సీఈవో చేయూత

జమ్మికుంట మండలం సీనియర్ పాత్రికేయులు వడ్లకొండ రాజు, సుధాకర్ ఇటీవల కాలంలో మృతి చెందగా వారి కుటుంబాలకు వీణవంక గ్రామానికి చెందిన యుప్ టీవీ సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి చేయూత అందించారు..

వారి పిల్లల ఉన్నత చదువులకై ఒక్కో నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాది పాటు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. ఇంటర్ మీడియట్ పూర్తి అయ్యే వరకు ఈ స్కాలర్ షిప్ అందనుంది. సోమవారం ఇరు కుటుంబాల పిల్లలకు జమ్మికుంట ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ నర్శిని శీను, దులం అంజి, వెన్నంపల్లి నారాయణ, శ్రీధర్ చేతుల మీదుగా చెక్కును అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల చదువుకోసం సాయం ఆ దించిన ఉదయనందన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు…

Comments

  • No comments yet.
  • Add a comment