Site logo

నాటు సారాయి స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గ్రామ శివారులో నాటు సారాయిని అక్రమంగా తయారు చేస్తున్నారని ఖచ్చితమైన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా గ్రామ శివారులో 100 లీటర్ల బెల్లం పానకం నాటు సారాయి తయారీకి నిల్వ ఉంచగా దానిని ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు. ఇట్టి దాడులలో సీఐ అక్బర్ హుస్సేన్, ఎస్ ఐ కబీర్ దాస్, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఎక్సైజ్ సీఐ అక్బర్ హుస్సేన్ మాట్లాడుతూ గ్రామాలలో చట్టవ్యతిరేకంగా నాటు సారాయి తయారుచేసి విక్రయించినట్లు అయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు నాటు సారాయి తీసుకుని అనారోగ్యం పాలు కాకూడదని ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉంటూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

  • No comments yet.
  • Add a comment