Site logo

ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపకులు శ్రీ స్వర్గీయ కె.వి. నారాయణ రెడ్డి గారి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం భూమి పూజ

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి 50 సంవత్సారాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పూర్వ విధ్యార్ధులు  మరియు ప్రస్తుత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి సెప్టెంబర్  06, 07 తేదీలలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్బంగా కళాశాలను స్థాపించి ఎన్నో వేల  మంది విద్యావంతులు కావడానికి కారణం అయినా స్థాపకులు శ్రీ స్వర్గీయ కె.వి. నారాయణ రెడ్డి గారి విగ్రహం కళాశాల ప్రాంగణంలో నెలకొల్పాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠాపన కోసం భూమి పూజ నిర్వహించడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల అసోసియేషన్ చైర్మన్ ప్రో. N.రామ స్వామి,  ప్రస్తుత కాలేజీ ప్రిన్సిపాల్ కలకుంట రామ కృష్ణ, అసోసియేషన్ వైస్ ఛైర్మన్స్ ఎం.ఏ. హుస్సేన్, టి.సుధాకర్ రెడ్డి మరియు అసోసియేషన్ సభ్యులు, కళాశాల అధ్యాపక బృదం పాల్గొనడం జరిగింది. 

Comments

  • No comments yet.
  • Add a comment